యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు బాలీవుడ్ వర్గాలను కుదిపేస్తున్నాయి. నెపోటిజం ఇష్యూ మొదలుకొని డ్రగ్స్ ఆరోపణల వరకూ బయటకొస్తున్న అన్ని విషయాలు బీ టౌన్ వర్గాలను వణికిస్తున్నాయి. బడా హీరోలుహీరోయిన్లు, దర్శకనిర్మాతలపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తుండటం, మీడియాలో రకరకాల వార్తలు షికారు చేస్తుండటంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.
సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటికి రావడం, వారిపై లోతుగా విచారణ చేపడ్డటం లాంటివి చకచకా జరిగిపోయాయి. మరోవైపు నిజానిజాలు ఏంటనేది తేలకముందే చిత్రసీమపై సోషల్మీడియాలో విమర్శనాత్మక వార్తలు వెల్లువెత్తున్నాయి. దీనిపై అక్షయ్ రియాక్ట్ అవుతూ ఆవేదన చెందారు.
చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ సమస్య లేదని అనడం లేదంటున్న అక్షయ్.. బాలీవుడ్లోని ప్రతి ఒక్కరికీ ఈ డ్రగ్స్ రాకెట్తో సంబంధం ఉందని అనుకోవడం తప్పని పేర్కొన్నారు. గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నా అంటూ సుశాంత్ ఆత్మహత్య, డ్రగ్స్ వ్యవహారం గురించి ఆయన మాట్లాడారు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి సమస్య తలెత్తిన తర్వాత మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, చిత్ర పరిశ్రమలో వేధింపులు, డ్రగ్స్ వాడకం లాంటి సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అర్థమైందని తెలిపారు.
మేమంతా దేశ ప్రజల మనోభావాలను తెరపై చూపించే ప్రయత్నం చేస్తుంటాం. సమాజంలోని బాధలను తెరపైకి తెచ్చి చూపిస్తుంటాం. కాబట్టి నిజానిజాలు తెలుసుకోకుండా దయచేసి అసత్య ప్రచారాలు మానుకోండి అని మీడియాను కోరారు అక్షయ్ కుమార్. బాలీవుడ్లో ఈ సమస్య లేదని చెప్పను గానీ అందరినీ ఒకే గాడిన కట్టేసి చూడకండి. అది చాలా తప్పు. మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా.. మొత్తం చిత్ర పరిశ్రమను చెడుగా చూడకండి అంటూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఎన్సీబీపై అధికారులపై నమ్మకం ఉందని, డ్రగ్స్ కేసు విచారణకు అందరూ సహకరిస్తామని అక్షయ్ తెలిపారు.
Bahot dino se mann mein kuch baat thi lekin samajh nahi aa raha tha kya kahoon, kisse kahoon. Aaj socha aap logon se share kar loon, so here goes… #DirectDilSe 🙏🏻 pic.twitter.com/nelm9UFLof
— Akshay Kumar (@akshaykumar) October 3, 2020