పశ్చిమగోదావరి జిల్లా (కొవ్వూరు)- మాజీ మంత్రివర్యులు, కె.ఎస్.జవహర్
★ భారతీ సిమెంట్ అమ్ముకోవడానికే నువ్వు సిఎం అయ్యావా జగన్ రెడ్డి?
★ అక్రమ నీటి కేటాయింపుల పర్వం పూర్తయ్యింది.
★ ఇప్పుడు సిమెంట్ మాఫియా డాన్ గా మారి రేట్లు విపరీతంగా పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారు.
★ సహా నిందితుల కంపెనీలతో సిమెంట్ మాఫియా ఏర్పాటు చేసి బస్తాకి 100 నుండి 150 అదనంగా, దోచుకుంటున్నారు.
★ నీ అక్రమార్జన కోసం భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి పొట్టన పెట్టుకున్నావ్.
★ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం కొనే సిమెంట్ అంతా భారతీ సిమెంట్, జగన్ కేసుల్లో సహా నిందితులైన కంపెనీలకే ఆర్డర్లు ఇస్తున్నారు.
★ భారతి సిమెంట్స్ కి 2,28,370 మెట్రిక్ టన్నులు, ఇండియా సిమెంట్స్ కి 1,59,753 మెట్రిక్ టన్నులు, పెన్నా కి 1,50,325 మెట్రిక్ టన్నులు.
★ ఇంకెంత మంది భవన నిర్మాణ కార్మికులను, నిర్మాణ రంగం పై ఆధారపడిన వారిని పొట్టన పెట్టుకుంటే నీ ధన దాహం తీరుతుంది జగన్ రెడ్డి?