అమరావతి :గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి మండలం తుమ్మల పాలెం పంచాయతీ పరిధిలోని సీతా రామిరెడ్డి పాలెం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఇరుపక్షాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.
చికిత్స నిమిత్తం వారిని తెనాలి వైద్యశాలకు తరలించారు.
విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.